రాష్ట్రంలో ఉన్నది కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ ‌: ఉత్తమ్‌

రాష్ట్రంలో ఉన్నది కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ ‌: ఉత్తమ్‌
x
Highlights

కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితర నాయకులు...

కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వరకు ఆ పార్టీ తలపెట్టిన ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సర్కార్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్ పనిచేయడం లేదని, కల్వకుంట్ల పోలీస్‌ సర్వీస్ పనిచేస్తోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ ఏది చెబితే దాన్ని పోలీసులు అమలు పరుస్తున్నారన్నారు.

హైదరాబాద్‌లో ఆర్‌ ఎస్ ఎస్‌ ర్యాలీకి, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా నిజామాబాద్‌లో మజ్లిస్‌ సభకు ఎలా అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, పోలీస్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. శాంతియుతంగా తిరంగా యాత్ర చేస్తామని చెప్పిన ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories