అద్దె గర్భం కోసం భార్యను అమ్మేసిన భర్త

అద్దె గర్భం కోసం భార్యను అమ్మేసిన భర్త
x
Highlights

అమాయక ప్రజలను ఆసరా చేసుకుని అద్దె గర్భాల కోసం ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు డబ్బు కోసం సరోగసికి ఒప్పుకుంటుంటే మరికొందరు భర్త., కుటుంబ సభ్యుల...

అమాయక ప్రజలను ఆసరా చేసుకుని అద్దె గర్భాల కోసం ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు డబ్బు కోసం సరోగసికి ఒప్పుకుంటుంటే మరికొందరు భర్త., కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు బెదిరింపులకు తలొగ్గుతున్నారు. అమ్మతనానికి అవకాశం లేని వారిని గుర్తించి కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం నకిరిపేట గ్రామంలో అద్దె గర్భం ఘటన వెలుగు చూసింది.

మానవత్వం మంటగలిసేలా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే భార్యాభర్తల సంబంధానికి అర్ధం లేకుండా పోతుంది. భద్రాద్రికొత్తగూడెంకు చెందిన భూక్యా రమేష్ ఏడేళ్ల క్రితం బూర్గంపాడు మండలం నకిరిపేటకు చెందిన రాణిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బు కోసం భార్యను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. భార్యకు తెలియకుండా అద్దె గర్భం కోసం భువనగిరి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు.

అనుమానం వచ్చిన బాధితురాలు భర్తను నిలదీసింది. విషయం బయటకు చెబితే ఇద్దరు పిల్లలతో సహా తనను చంపుతానంటూ బెదిరించేవాడు అంటు బాధితురాలు వాపోయింది. దిక్కుతోచని స్థితిలో బాధిత మహిళ పుట్టింటికి వచ్చి విషయాన్ని చెప్పుకుంది. బాధితురాలి తల్లి, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బూక్యా రమేష్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాధితురాలిని పరామర్శించారు. డబ్బు కోసం అక్రమాలకు పాల్పడిన రమేష్ ను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. అమాయక మహిళలతో అయిష్టంగా జరిపిస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories