తాబేళ్ల కోసం ఎగబడుతున్న స్థానికులు

తాబేళ్ల కోసం ఎగబడుతున్న స్థానికులు
x
Highlights

గుర్తు తెలియని వ్యక్తులు వందల కొద్ది తాబేళ్లను రోడ్డు పక్కన వదిలి వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ములకలపల్లి మండలం...

గుర్తు తెలియని వ్యక్తులు వందల కొద్ది తాబేళ్లను రోడ్డు పక్కన వదిలి వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మార్గం మధ్యలో గుర్తుతెలియని వాళ్లు తాబేళ్లను వదిలివెళ్లారు. ఆ ప్రాంతంలో తాబేళ్లు ఉన్నాయని గమనించిన కొంత మంది వ్యక్తులు మిగతావారికి సమాచారం అందించారు. దీంతో ఆ తాబేళ్లను చూడాడానికి జనాలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అంతే కాక కొంత కూలీ పనులకు వచ్చిన వారు అందిన కాడికి ఆ తాబేళ్లను వారి ఇళ్లకు తీసుకెళ్తున్నారు.

ఈ సంఘటనపై ములకలపల్లి సురేష్ మాట్లాడుతూ తాబేళ్లను వ్యాపార నిమిత్తం పెద్దమొత్తంలో ఎక్కడికో తరలించే క్రమంలో వేరే లారీలో ఎక్కించే ప్రయత్నం చేసే సమయంలో కిందపడి ఉంటాయా, లేదా పోలీసులు కంటబడటంతో దొంగలు తాబేళ్లను ఇలా వదిలేసి వెళ్లి ఉంటారా అని భావిస్తున్నారు. స్థానికులు తాబేళ్ల కోసం ఎగబడుతుండటంతో ఆ ప్రాంతం మాత్రం కోలాహలంగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories