ఈ మృగాళ్లకు ఇంకా ముసుగులెందుకు..?

Priyanka reddy murder case
x
Priyanka reddy murder case
Highlights

వారిని జైల్లో వేయకూడదు .భాదితురాలు పడ్డ బాధ వాళ్ళు కూడా పడాలి. ఆ నొప్పి వారికి తెలియలి. వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టాలి.

అర్దరాత్రి అమ్మాయిపై అఘాయిత్యం చేసిన నలుగురు దుండగులను నడిరోడ్డుపై ఉరి తీయాలి. మృతదేహాన్ని కూడా వదలకుండా అత్యాచారం చేసిన వారికీ భూమ్మీదా బతికే అర్హత లేదు. వారి కంటే అడివిలో ఉండే జంతువులే బెటర్ ... వారిని జైల్లో వేయకూడదు .భాదితురాలు పడ్డ బాధ వాళ్ళు కూడా పడాలి. ఆ నొప్పి వారికి తెలియలి. వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టాలి. ఇలాంటి మృగాళ్లకు ఇంకా ఆ ముసుగులెందుకు? అని ప్రియాంక రెడ్డి హత్యపై ప్రజలు డిమాండ్ చేస్తున్న ప్రశ్నలు ఇవి..

ఈ రోజు షాద్‌నగర్‌ పోలీన్‌ స్టేషన్‌‌ వద్దకి భారీ ఎత్తున ప్రజలు, ప్రజా సంఘాలు చేరుకున్నాయి. భారీ ఎత్తున నిరసనలు వినిపించాయి. వారిని కంట్రోల్ చేయడం పోలిసుల తరం కూడా కాలేదు. చేసేది ఏమీ లేకా వైద్యులను పోలీస్ స్టేషన్‌కే తీసుకువచ్చి నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారంటే అర్ధం చేసుకోవచ్చు పరిస్థితి అక్కడ ఎలా ఉందొ..

ఇక నిందితులను జైలుకు తరలించడం పోలీసులకు తలకు మించిన భారమైంది. భారీ భద్రత నడుమ నిందితులను జైలుకి తరలించారు పోలీసులు.. నిందితులను తరలిస్తున్న పోలీసు వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు విసిరారు. వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. వారిని పోలీసులు లాఠీఛార్జ్ చేసి తప్పించారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిందితులను శనివారం (నవంబర్ 30) చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories