తెలంగాణలో రాష్ట్రంలో మహాశివరాత్రి సంబరాలు మొదలయ్యాయి. నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తుతారు.
తెలంగాణ రాష్ట్రంలో మహాశివరాత్రి సంబరాలు మొదలయ్యాయి. నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తుతారు. ఈ పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారా సిద్దిపేట మీదుగా వెల్లవలసి ఉంటుంది. కాగా హైదరాబాద్ నుంచి ప్రతి ఏటీ ఎంతో మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి గాను పెద్ద సంఖ్యలో వేముల వాడకు తరలివెళ్తారు. ఇందులో భాగంగానే ప్రముఖ శైవక్షేత్రం అయిన వేములవాడకు శివరాత్రి సందర్భంగా హెలికాప్టర్ సేవలను పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించారు.
గురువారం నుంచి ఫిబ్రవరి 23 వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి వేములవాడకు వెళ్లడానికి ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ సహకారంతో ఈ హెలీకాప్టన్ సేవలను ప్రారంభించారు. హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రావడం ఆర్థికంగా కలిగిన భక్తులకు ఊరటనిచ్చే అంశం. ధరలు కూడా అందుబాటులోనే ఉండటంతో మధ్య తరగతి వారు కూడా సరదాగా ప్రయాణించే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలను భక్తుల కోసం ఏర్పాటు చేసింది.
ఇక పోతే వేములవాడకు వెళ్లే భక్తులు కోసం తెలంగాణ పర్యాటక శాఖ హెలీకాప్టర్ సేవలను 3 రకాల ప్యాకేజీల్లో అందిస్తున్నారు. ఇందులో ప్యాకేజీ-1లో వేములవాడ నుంచి వ్యూ పాయింట్కు 7 నిమిషాల రైడ్కు టికెట్ ధర రూ.3 వేల తీసుకుంటున్నారు. అదే విధంగా ప్యాకేజీ-2లో ఈ ప్యాకేజీ కోసం కనీసం ఆరుగురు వ్యక్తులు ఉంటారు. దీని ప్రయాణ సమయం 16నిమిషాల పాటు ఉంటుంది. వేములవాడ మిడ్ మానేరు పరిసర ప్రాంతాలు వీక్షించడానికి రూ.5,500. చార్జి చేస్తున్నారు. ఇక చివరి ప్యాకేజీ-3వ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి వేములవాడకు తీసుకెళ్లి దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్కు తీసుకొస్తారు. ఇందుకు గాను టికెట్ ధర రూ.30 వేలు చార్జి తీసుకుంటున్నారు.
ఈ ప్యాకేజీలో కోసం కనీసం ఐదుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఇక పోతే ఈ వేములవాడ హెలికాప్టర్ సేవల బుకింగ్ చేసుకోవడం కోసం 09400399999, 09880505905, 07994481767, 09544444693 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాతర సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వేములవాడకు ఏసీ బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాక భవిష్యత్లో ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలు కొనసాగించనున్నట్లు తెలిపారు.
Flagged off #MahaShivratri special Heli Ride at Begumpet. @KTRTRS @TelanganaCMO @trspartyonline #TelanganaTourism #Shivratri #Vemulawada #Hyderabad pic.twitter.com/TTRAVcKioT
— V Srinivas Goud (@VSrinivasGoud) February 20, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire