నౌహీరా షేక్‌కు షాక్.. రూ.5కోట్ల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చిన హైకోర్టు

నౌహీరా షేక్‌కు షాక్.. రూ.5కోట్ల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చిన హైకోర్టు
x
నౌహీరా
Highlights

హీరా గ్రూప్‌ ఎండీ నౌహీరాకు బెయిల్‌ మంజూరైంది. 5 కోట్ల పూచీకత్తుతో హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. హీరా గ్రూప్‌...

హీరా గ్రూప్‌ ఎండీ నౌహీరాకు బెయిల్‌ మంజూరైంది. 5 కోట్ల పూచీకత్తుతో హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. హీరా గ్రూప్‌ కేసులను తీవ్ర మోసాల దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని ఆదేశించింది.

బంగారంలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి సుమారు 1.25 లక్షల ఇన్వెస్టర్ల నుంచి 6 వేల కోట్లకు పైగా హీరా గ్రూప్‌ వసూళ్లకు పాల్పడింది. విదేశాల నుంచి కూడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిధులు సేకరించారంటూ ఈడీ సైతం కేసు నమోదు చేసింది. మరోవైపు పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారంటూ నౌహీర తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు నౌహీరాకు బెయిల్‌ మంజూరు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories