వాయిదా పడ్డ హాజీపూర్, సమత కేసులు

వాయిదా పడ్డ హాజీపూర్, సమత కేసులు
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో తుదితీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. కుమ్రంబీమ్ జిల్లా ఎల్లాపటార్‌ గ్రామంలో జరిగిన...

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో తుదితీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. కుమ్రంబీమ్ జిల్లా ఎల్లాపటార్‌ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు నేడు తుదితీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉండటంతో వాయిదా వేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కుమ్రంబీమ్ జిల్లా ఎల్లాపటార్‌లో ముగ్గురు నిందితులు సమతను గ్యాంగ్‌ రేప్ చేసి హత్య చేశారు. కేసు విచారణ కోసం డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు డిసెంబర్ 14న 90 పేజీల చార్జ్‌ షీటును దాఖలు చేశారు. 40 మంది సాక్షుల్లో 20మందిని డిసెంబర్ 23 నుంచి 31 వరకు కోర్టు విచారించింది. నిందితుల తరపున వాదించడానికి న్యాయవాదులు ముందుకు రాకపోవడంతో కోర్టు న్యాయవాది రహీంను నియమించింది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలపై తుది తీర్పు ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. హాజీపూర్‌లో బాలికలను దారుణంగా అత్యాచారం, హత్యలపై నల్గొండలోని ప్రత్యేక ఫోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుల్లో హాజీపూర్‌ నిందితుడు వరంగల్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అక్టోబర్ 14 నుంచి హాజీపూర్ కేసులపై విచారణ జరుగుతుంది. ఈ కేసుల్లో 101 మంది సాక్షులను కోర్టు విచారించింది. నిందితుడిని కోర్టు ఎగ్జామిన్ చేసింది. అత్యాచారం, హత్యలపై ఇరు పక్షాల న్యాయవాదులు జడ్జీ ముందు వాదనలు వినిపించారు. జనవరి 17న తుది వాదనలు ముగిశాయి. నిందితుడికి ఉరే సరని హాజీపూర్ గ్రామస్తులంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories