హాజీపూర్ కేసు: ముగిసిన విచారణ.. ఈనెల 27న తుది తీర్పు !

హాజీపూర్ కేసు: ముగిసిన విచారణ.. ఈనెల 27న తుది తీర్పు !
x
హాజీపూర్ కేసు: ముగిసిన విచారణ.. ఈనెల 27న తుది తీర్పు !
Highlights

నల్గొండ జిల్లా హాజీపూర్‌ వరుస హత్యల కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో వాదనలు ముగిశాయి. శ్రీనివాస్‌ రెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు...

నల్గొండ జిల్లా హాజీపూర్‌ వరుస హత్యల కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో వాదనలు ముగిశాయి. శ్రీనివాస్‌ రెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని.. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి వాదనలు కూడా విన్న ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు ఈ నెల 27వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories