గిరిజన సాంప్రదాయాలతో గవర్నర్ కు స్వాగతం

గిరిజన సాంప్రదాయాలతో గవర్నర్ కు స్వాగతం
x
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌
Highlights

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్ర పర్యటన రెండోరోజు కొనసాగుతుంది.

జయశంకర్‌ భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్ర పర్యటన రెండోరోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంగళవారం గవర్నర్ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. తమ జిల్లాకు విచ్చేసిన గవర్నర్ ను అక్కడి ప్రజలు, నాయకులు ఘనంగా స్వాగతించారు. గిరిజనుల సాంప్రదాయ వాయిద్యాలతో, డప్పు చప్పులతో, నృత్యాలను వేస్తూ గవర్నర్‌కు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భూపాలపల్లిలో జనరిక్‌ మందుల దుకాణాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి కాటారం మండలం బోడగూడెంను గవర్నర్‌ సందర్శించారు. అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను గురించి వారి జీవన స్థితిగతులను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ పర్యటనలో భాగంగా ఆయా ప్రదేశాలలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories