భక్తులకు శుభవార్త: ఇష్టదైవం ప్రసాదం నేరుగా ఇంటికే..

భక్తులకు శుభవార్త: ఇష్టదైవం ప్రసాదం నేరుగా ఇంటికే..
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని భక్తులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవాదాయశాఖ గుడ్ న్యూస్‌ను తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలోని భక్తులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవాదాయశాఖ గుడ్ న్యూస్‌ను తెలిపింది. ఆలయానికి వెళ్లడం వీలుకాని భక్తులకు నేరుగా వారి ఇంటికే స్వామిఅమ్మవార్ల ప్రసాదంతో పాటు అక్షితలు, కుంకుమను పంపిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. ఇందుకు గాను స్పీడ్ పోస్టులో తపాలాశాఖ ఈ సేవలను భక్తులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ అధికారులు పోస్టల్(తపాలా) శాఖ అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు.

ఇక భక్తుల ఈ సేవలను పొందేందుకు చెల్లింపులను నెట్ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ పద్ధతుల్లో స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం దేవాదాయ శాఖ ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ సేవ ద్వారా ఎంతో మంది భక్తులు స్వామి వారి ప్రసాదాన్ని తీసుకుని స్వామి కృపకు పాత్రులు కాబోతున్నారు.

త్వరలోనే భక్తులకు అందుబాటులో రానున్న ఈ సేవలతో ఒక్క యాదాద్రిలోనే కాకుండా బాసర, భద్రాచలం, వేములవాడ సహా మరో 10 ఆలయాలు ఈ జాబితాలో చేరనున్నాయి. దీని ద్వారా భక్తులు కోరుకున్న విధంగా ప్రసాదం, అక్షితలు, కుంకుమను స్పీడ్ పోస్టులో ఇంటికి పంపేలా తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇక పోతే ఆన్ లైన్ చెల్లింపులను పోస్టల్ శాఖ బరువు ఆధారంగా నిర్ణయించనుంది. ఈ సేవలు ఫిబ్రవరి నెలాఖరుకల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇక కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ సేవల ద్వారా భక్తులు తమ ఇష్టదైవాల ప్రసాదాన్ని, అక్షింతల ద్వారా దేవుళ్ల ఆశీర్వాదాలను పొందవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories