మరుగుదొడ్డి కోసం గుంతలు తవ్వుతుంటే.. గుప్త నిధులు లభ్యం

మరుగుదొడ్డి కోసం గుంతలు తవ్వుతుంటే.. గుప్త నిధులు లభ్యం
x
Highlights

జోగులాంబ గద్వాల జిల్లాలో గుప్తనిధులు బయటపడ్డాయి. గద్వాల మండలం పూడురులో మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతలో బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. గుంతలో మంట్టి...

జోగులాంబ గద్వాల జిల్లాలో గుప్తనిధులు బయటపడ్డాయి. గద్వాల మండలం పూడురులో మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతలో బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. గుంతలో మంట్టి తీస్తుండగా కల్లుముంత ఆకారంలో ఉన్న కుండలో బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. గుప్తనిధుల విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామాన్ని సందర్శించారు. 11 బంగారు, 19 వెండి నాణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పురావస్తు శాఖ అధికారులకు నాణాలు అప్పగించారు. అయితే ఈ సంఘటన జరిగి వారం రోజులు అవుతోంది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నాణాలను జప్తు చేసుకున్నారు. అయితే ఈ నాణాల విషయం గుట్టుచప్పుడు కాకుండా ఉండేందుకు ఇంటి యాజమాని (వెంకన్న) చుట్టుప్రక్కల వారికి కూడా పంచిపెట్టారని సమాచారం. దీంతో ఎవరి వద్ద ఉన్నాయో విచారణ కొనసాగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories