అతి త్వరలో గజ్వేల్ లో రైలు కూత... మనోహరాబాద్‌- గజ్వేల్‌ రైలు మార్గం అతిత్వరలో ప్రారంభం

అతి త్వరలో గజ్వేల్ లో  రైలు కూత... మనోహరాబాద్‌- గజ్వేల్‌ రైలు మార్గం అతిత్వరలో ప్రారంభం
x
Highlights

గజ్వేల్ వాసులను రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. అతి త్వరలో గజ్వేల్‌ మార్గంలో రైలును నడపనుంది.

గజ్వేల్ వాసులను రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. అతి త్వరలో గజ్వేల్‌ మార్గంలో రైలును నడపనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయాణానికి అనుగుణంగా మనోహరాబాద్‌- కొత్తపల్లి 151 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చేపట్టిన మనోహరాబాద్‌- గజ్వేల్‌ 31 కిలోమీటర్ల రైల్వేలైన్‌ మొదటిదశ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో ట్రయల్స్ వేసి, భద్రతా తనిఖీలు పూర్తిచేసిన రైల్వే అధికారులు ప్యాసింజర్‌ రైళ్లు నడిపేందుకు అనుమతినిచ్చారు. దీంతో గజ్వేల్ ప్రాంత ప్రజలకు అతి త్వరలోనే రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2016 లో ఈ రైల్వే పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ రూ.1,160 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపనచేశారు. ఐదు దశల్లో పూర్తిచేయనున్న ఈ రైల్వే మార్గం పనులను 2018లో ప్రారంభించారు. ఇప్పటికే ఈ రైల్వేలైన్‌లో భాగంగా 61 వంతెనలను నిర్మించారు. ఈ వంతెనల్లో 45 మైనర్‌ వంతెనలు ఉండగా ఇందులో నాలుగు భారీ వంతెనలు ఉన్నాయి. ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు ఎలాంటి రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ లేకుండా ప్రణాళిక రూపొందించి పనులు పూర్తిచేశారు.

ఇక ఈ ప్రాజెక్టు వ్యయంలో 33 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. అంతే కాదు రైల్వే మార్గం నిర్మించేందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి రైల్వేశాఖకు అప్పగిస్తున్నది. భూసేకరణ అనంతరం 24 నెలల రికార్డు సమయంలో మొదటిదశ 31 కిలోమీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా ఈ మార్గం గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లికి చేరుకోనున్నది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌వరకు మధ్యలో రెండు రైల్వేస్టేషన్లు నాచారం, ఎల్కల్‌ బేగంపేట ఉన్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా టన్నెల్‌ మీదుగా రైల్వేలైన్‌ వెళ్లింది. గజ్వేల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద 51 మీటర్ల పొడవైన విల్లు ఆకారం స్ట్రింగ్‌ గర్డర్‌ను ఏర్పాటుచేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories