బావా.. మన చాంబర్లు చూసుకుందామా.. : హరీశ్‌తో కేటీఆర్

బావా.. మన చాంబర్లు చూసుకుందామా.. : హరీశ్‌తో కేటీఆర్
x
Highlights

బావ, బావమరుదులు చాలాకాలం తర్వాత మళ్లీ కలిశారు. కలిసి చిరునవ్వులు చిందించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. సచివాలయం, అసెంబ్లీ భూమి పూజ సందర్భంగా మాజీమంత్రులు...

బావ, బావమరుదులు చాలాకాలం తర్వాత మళ్లీ కలిశారు. కలిసి చిరునవ్వులు చిందించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. సచివాలయం, అసెంబ్లీ భూమి పూజ సందర్భంగా మాజీమంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు చాలాకాలం తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

అరుదుగా కనిపించే ఈ దృశ్యం తెలంగాణ నూతన సచివాలయం సందర్భంగా నిర్వహించిన భూమిపూజ సందర్భంగా కనిపించింది. తెలంగాణలో పొలిటికల్‌ బావా బావమరుదులు కేటీఆర్‌, హరీశ్‌రావు చాలాకాలం తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఒక్కచోట చేరి చిరునవ్వులు చిందించారు. ఒకరికొకరు ముచ్చటించుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన నూతన సచివాలయం, అసెంబ్లీ భూమి పూజ సందర్భంగా ఈ ఇద్దరు మాజీ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మన పాత చాంబర్లు చూసుకుందామా అని.. కేటీఆర్‌.. హరీశ్‌ను అడిగారు. మరోసారి వీలవుతుందో లేదో అని సందేహంతోనే అడిగారు. దీనికి హరీశ్‌రావు చిరునవ్వే సమాధానమైంది. ఆ తర్వాత కార్యకర్తలతో సెల్ఫీలు దిగిన ఈ ఇద్దరూ ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories