కరీంనగర్‌లో మరో 4 కరోనా కేసులు

కరీంనగర్‌లో మరో 4 కరోనా కేసులు
x
Highlights

కరీంనగర్‌ నగరాన్ని కరోనా మహమ్మారి కలవరానికి గురి చేస్తోంది. కరీంనగర్‌లో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో సుజాత...

కరీంనగర్‌ నగరాన్ని కరోనా మహమ్మారి కలవరానికి గురి చేస్తోంది. కరీంనగర్‌లో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో సుజాత వెల్లడించారు. ఢిల్లీలోని మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో ముగ్గురికి, ఇండోనేసియా వారితో సన్నిహితంగా తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు.

కరోనా సోకిన బాధితులను గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. అదేవిధంగా కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌ చేసినట్లు వెల్లడించారు. కరీంనగర్‌లో మొత్తం ఇప్పటి వరకు 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ నిర్ధారణ అయిన వారిలో 10 మంది ఇండోనేసియా వాసులు ఉన్నారని డీఎంహెచ్‌వో చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories