టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..

టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..
x
Highlights

ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ టీ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య గురువారం నాడు ఉదయం మృతి చెందాడు. ఆయన వయస్సు 68 ఏళ్లు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో...

ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ టీ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య గురువారం నాడు ఉదయం మృతి చెందాడు. ఆయన వయస్సు 68 ఏళ్లు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మృతి చెందాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతన్నారు. తెలంగాణ కోసం పని చేసిన ఉద్యమ నాయకుడిగా 2009, 2011 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమి పాలయ్యారు.

టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories