బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది: విద్యాసాగర్‌రావు

బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది: విద్యాసాగర్‌రావు
x
Highlights

మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తిరిగి బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయనకు పార్టీ...

మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తిరిగి బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందించి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. మొన్నటి వరకు గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌రావు పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకి లక్ష్మణ్‌ బీజేపీ సభ్వతాన్ని ఇచ్చారు. పార్టీ సభ్యత్వం స్వీకరించిన అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. 'పార్టీ కార్యకర్తల శ్రమ వల్లనే ఎదిగాను. బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది. ఇప్పటి నుంచి బీజేపికి పూర్తిగా అంకితమవుతాను. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని' విద్యాసాగర్‌ రావు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories