మాజీ కౌన్సిలర్ దౌర్జన్యం..అక్రమ నిర్మాణంపై ప్రశ్నించినందుకు..

మాజీ కౌన్సిలర్ దౌర్జన్యం..అక్రమ నిర్మాణంపై ప్రశ్నించినందుకు..
x
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ నగర్ లో ఓ మాజీ కౌన్సిలర్ అధికారులపైనే దాడి చేస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సిరిగిరి రమేష్ అనే మాజీ...

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ నగర్ లో ఓ మాజీ కౌన్సిలర్ అధికారులపైనే దాడి చేస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సిరిగిరి రమేష్ అనే మాజీ కౌన్సిలర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. హౌస్ పర్మిషన్ కు మించి పెంట్ హౌస్ కూడా వేస్తున్నాడన్న ఫిర్యాదులు మేరకు ఆ పనులు నిలిపివేయాలని మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ ను అధికారులు ఆదేశించారు. దాంతో కోపోద్రిక్తుడైన మాజీ కౌన్సిలర్ అసహనంతో అధికారులపై దాడికి దిగాడు. మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ దృష్టికి తీసుకుపోగా జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories