కీసర గుట్ట వద్ద మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌ ఫోటోలతో ఫ్లెక్సీలు

కీసర గుట్ట వద్ద మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌ ఫోటోలతో ఫ్లెక్సీలు
x
Revanth Reddy (File Photo)
Highlights

హైదరాబాద్‌ కీసర గుట్ట వద్ద ఫ్లెక్సీల రగడ రాజుకుంది. కీసర గుట్ట వద్ద మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌ ఫోటోలతో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌ కీసర గుట్ట వద్ద ఫ్లెక్సీల రగడ రాజుకుంది. కీసర గుట్ట వద్ద మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌ ఫోటోలతో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుపై అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి.

అనుమతి లేని ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ మొత్తం ఒక రూల్‌ ఉంటే... కీసర గుట్ట దగ్గర మరో రూల్‌ నడుస్తోందని విమర్శించారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం ఉన్నా.... కీసర గుట్ట దగ్గర పెద్ద ఎత్తున మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఫైరయ్యారు. ఫ్లెక్సీలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై జీహెచ్ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్పందించారు. కీసర గుట్ట జీహెచ్ఎంసీ పరిధిలోకి రాదని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తగదన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఫ్లెక్సీలను తీసివేస్తారని భావిస్తున్నానన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories