అదృశ్యమైన ఐదుగురు అమ్మాయిలు.. యువకుడు రిసీవ్..

అదృశ్యమైన ఐదుగురు అమ్మాయిలు.. యువకుడు రిసీవ్..
x
Highlights

కరీంనగర్‌ జిల్లా కేశవపట్నంలో ఐదుగురు విద్యార్ధినిలు ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ కేసును...

కరీంనగర్‌ జిల్లా కేశవపట్నంలో ఐదుగురు విద్యార్ధినిలు ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని అమ్మాయిలను వెతికారు. పాఠశాల పక్కనున్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. రాత్రి పదకొండు గంటల సమయంలో ఐదుగురు అమ్మాయిలు గోడదూకి పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ తర్వాత అక్కడి బస్టాండ్‌లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాల్లో ఓ అబ్బాయి... వీరిని తీసుకెళ్లినట్లు కనిపించింది.

దీంతో ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు ఎక్కడ ఉన్నది చెప్పేశాడు. నిజామాబాద్‌ బస్టాండ్‌లో ఐదుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకొన్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరు తప్పిపోవడానికి అందులో ఓ అమ్మాయే కారణమనట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఆ అమ్మాయి ఇలాగె చేసినట్టు విచారణలో తేలింది. కాగా శుక్రవారం రాత్రి నుంచి ఈ విద్యార్ధినిలు హాస్టల్‌లో కనిపించకపోవడంతో స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన విద్యార్థినిలు ఐశ్వర్య, తేజశ్రీ, రేణుకా, రేవణ్య, భవానిగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories