Hyderabad: రైల్లో మంటలు.. రెండు బోగీలు దగ్ధం..

Hyderabad: రైల్లో మంటలు.. రెండు బోగీలు దగ్ధం..
x
Fire Accident at Moulali Railway Station
Highlights

మౌలాలి రౌల్వే స్టేషన్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్టేషన్ లో ఆగి ఉన్న రైలుకు చెందిన రెండు భోగీల్లో మంటలు చెలరేగాయి.

హైదరాబాద్ మౌలాలి రౌల్వే స్టేషన్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్టేషన్ లో ఆగి ఉన్న రైలుకు చెందిన రెండు భోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్ లో ఉన్న ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది భోగీల్లో భారీగా ఎగసిపడుతున్న మంటలను 3 ఫైర్ ఇంజిన్లతో అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ ప్రమాదంలో ఒక బోగి పూర్తిగా మంటల్లో కాలిపోగా, మరో బోగీకి మంటలు కాస్త స్వల్పంగా కాలింది.

మరికొన్ని భోగీలకు మంటలు వ్యాపించడానికి ముందే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్మి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మంటలు ఒచ్చిన సమయంలో ఎవరూ కూడా ఆ భోగీలో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అసలు ఈ మంటలు ఎలా రాజుకున్నాయి, ఎక్కడ నుంచి మంటలు వచ్చాయనే విషయం పై ఇంకా సరైన సమాచారం రాలేదు. ఈ విషయంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక పోతే నిన్నటికి నిన్న హైదరాబాద్ శివార్లలో ఓ ప్రయివేటు బస్సు దగ్ధమైంది. ఆ ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో ప్రయాణికులకు ఎవరికీ అపాయం జరగలేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories