ఉల్లి కోసం లొల్లి..వ్యాపారి తల పగలగొట్టిన ఆటో డ్రైవర్!

ఉల్లి కోసం లొల్లి..వ్యాపారి తల పగలగొట్టిన ఆటో డ్రైవర్!
x
Highlights

డబ్బుల కోసం కొట్టుకునే వాళ్లని చూసాం, బంగారం కోసం కొట్టుకునే వాళ్లనీ చూసాం, కానీ ఇద్దరు వ్యక్తులు విచిత్రంగా ఉల్లి కోసం కొట్టుకున్నారు.

డబ్బుల కోసం కొట్టుకునే వాళ్లని చూసాం, బంగారం కోసం కొట్టుకునే వాళ్లనీ చూసాం, కానీ ఇద్దరు వ్యక్తులు విచిత్రంగా ఉల్లి కోసం కొట్టుకున్నారు. చిన్నగా మొదలయిన ఉ్లలి గొడవ పెరిగి పెద్దదయి కొట్టుకునే దాక వెల్లింది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ విచిత్రమైన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల్లోకెళితే రహమత్‌నగర్‌కు చెందిన వీరన్న ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాడన్నారు. అతను సరదాగా మంగళవారం సాయంత్రం ఎస్‌ఆర్‌నగర్‌ సమీపం లోని బాపూనగర్‌లో ఉన్న చాట్‌బండార్‌లో పానీపూరి తినడానికి వెళ్లాడని తెలిపారు. పదిరూపాయల పానీపూరి తింటూ ఉల్లిపాయ ఎందుకు వేయలేదని చాట్ బండి అతన్ని అడిగాడని. దీంతో బండీ నడుపుతున్న సర్దార్‌ పవార్‌ 'ఉల్లిపాయలు వేసేందుకు బిర్యానీకి ఏమైనా ఆర్డర్‌ ఇచ్చావా' అంటూ హేళనగా మాట్లాడాడని తెలిపారు.

ఈ మాటకు ఆగ్రహించిన ఆటో డ్రైవర్ వీరన్న ఉల్లిపాయ వేయనందున నీకు డబ్బులు ఇచ్చేది లేదని గొడవపెట్టుకున్నాడు. ఉల్లి ధర పెరిగినందున నీకే కాదు ఎవరికీ వేయటం లేదని పవార్‌ బదులిచ్చాడని తెలిపారు. డబ్బులివ్వకుండా కోపంతో వీరన్న వెళ్లడాన్ని గమనించిన పవార్ ఆగ్రహం అతనిపై చేయి చేసుకున్నాడన్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి వీరన్న ఇనుపరాడ్‌ తీసుకుని పవార్‌ తల పగుల గొట్టాడని, వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories