ప్రభుత్వం చెప్పిన పంటలనే రైతులు సాగుచేయాలి : సీఎం కేసీఆర్

ప్రభుత్వం చెప్పిన పంటలనే రైతులు సాగుచేయాలి : సీఎం కేసీఆర్
x
CM KCR(File photo)
Highlights

రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరి పంట సాగు ఈ వర్షాకాలంలోనే ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం అందరూ ఒకే రకమైన పంటలు పండించడమేనని అన్నారు. మార్కెట్ డిమాండుకు తగ్గట్లు పంటలు పండించాలని కేసీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడికి, గత వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు పంటల మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటు గురించి అనేక మార్లు చెప్పానని, ఇంతకు మించిన గత్యంతరం లేదని, అందరూ ఒకే పంట వేసే విధానం పోయితీరాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఏది పడితే అది పండించి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి, పండిన పంటలు మార్కెట్ కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరని, డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని, అమ్ముడుపోయే సరుకే పండించాలని, రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే చెబుతుందని కేసీఆర్ అన్నారు.

ఈ వర్షాకాలంలో వరిపంటతో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే పద్ధతి ప్రారంభం కావాలని వ్యవసాయ సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని, ఇందులో సన్న, దొడ్డు రకాలుండాలని తేల్చారు. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధానంపై చర్చించేందుకు, తగు సూచనలు చేసేందుకు ఈ నెల 15న మద్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories