హైదరాబాద్‌లో సుష్మాస్వరాజ్ విగ్రహం పెట్టాలి: నాగం జనార్థన్ రెడ్డి

హైదరాబాద్‌లో సుష్మాస్వరాజ్ విగ్రహం పెట్టాలి: నాగం జనార్థన్ రెడ్డి
x
Highlights

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్‌ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సుష్మా.. చికిత్స పొందుతూ మరణించిన...

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్‌ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సుష్మా.. చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి నాగర్‌కర్నూల్ లో మీడియాతో మాట్లాడుతూ సుష్మాస్వరాజ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్రపోషించారని, తెలంగాణ ప్రజలు చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్లు పార్లమెంటులో వివరించారని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడంలో కూడా ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నా.. పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయ్యేందుకు సుష్మా సహకరించారని నాటి పరిస్థితులను గుర్తుచేశారు. తెలంగాణ వీర, ధీర వనిత సుష్మాస్వరాజ్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత కృషిచేసిన చిన్నమ్మకు హైదరాబాద్‌లో సుష్మాస్వరాజ్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలని నాగం జనార్థన్ కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories