కరోనా నివారణకు ఆయుర్వేద కిట్లు..

కరోనా నివారణకు ఆయుర్వేద కిట్లు..
x
Etela Rajendar(File photo)
Highlights

ఆయుర్వేదం అతి ప్రాచీనమైనది వైద్య శాస్త్రం అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

ఆయుర్వేదం అతి ప్రాచీనమైనది వైద్య శాస్త్రం అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మొదటి దఫాగా 20 వేల కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ ఆయుర్వేద కిట్లను రెడ్ జోన్లలో అహర్నిషలు పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి అందజేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కరోనా వ్యాప్తిని భారత దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల రేటు చాలా తక్కువ ఉందని ఆయన వెల్లడించారు. ఆయుష్ కమీషనర్ అలుగు వర్షిణి ఆధ్వర్యంలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఐదు రకాల మందులతో కరోనాను ఎదుర్కొనేందుకు కిట్ తయారు చేశారన్నారు. ప్రపంచంలో ఆయుర్వేద వైద్యం ఇప్పటివ వరకు ఏ దేశం అందించలేదని, అది కేవలం భారత దేశానికి మాత్రమే సాధ్యమైందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ఆయుష్ కంపెనీ వారికి అభినందనలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ కమిషనర్‌ విశ్వప్రసాద్, ఐజిపి హోమ్ గార్డ్స్ బాలనాగాదేవి, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డిలకు మంత్రి ఈటల రాజేందర్ ఆయుష్‌ రక్ష కిట్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్ అడిషనల్ డెరైక్టర్ అనసూయ, ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, సూపరింటెండెంట్ పరమేశ్వర్, ఫార్మసీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ప్రొఫెసర్ కేసీ. డాక్టర్ శ్రీకాంత్ బాబు, డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ డైరెక్టర్ శ్రీనివాస చారీ, కేంద్ర ఆయుర్వేద రీసెర్చ్ కౌన్సిల్ అధికారి డాక్టర్ సాకేత్ రాం, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, విశ్వ ఆయుర్వేద పరిషత్ నేషనల్ సెక్రెటరీ డాక్టర్ ప్రేమనందరావు. డాక్టర్ సురేష్ జకోటియ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories