మద్యం మత్తులో కారు బీభత్సం... స్కూల్ విద్యార్థినికి గాయాలు

మద్యం మత్తులో కారు బీభత్సం... స్కూల్ విద్యార్థినికి గాయాలు
x
Highlights

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌ గ్రామంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఉదయం పూటే ఫుల్‌గా తాగిన యువకులు గ్రామంలోని వీధుల్లో ఇష్టానుసారం...

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌ గ్రామంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఉదయం పూటే ఫుల్‌గా తాగిన యువకులు గ్రామంలోని వీధుల్లో ఇష్టానుసారం డ్రైవింగ్‌ చేశారు. ముందుగా ఓ గేదెను ఆ తర్వాత అదే దారిలో వెళ్తున్న హైమవతి అనే బాలికను ఢీ కొట్టారు. ఉదయం స్కూల్‌కు వెళ్తున్న సమయంలో హైమవతి ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలైన హైమవతిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మధ్యం మత్తులో ఉన్న యువకులను పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు తాగుబోతులను రిమాండ్‌కు పంపించారు. ఇద్దరు యువకులు హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందినవారిగా గుర్తించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories