మార్చి చివరినాటికి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తాం : మంత్రి ప్రశాంత్ రెడ్డి

మార్చి చివరినాటికి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తాం : మంత్రి ప్రశాంత్ రెడ్డి
x
Highlights

డబుల్ బెడ్ రూం ఇండ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా పూర్తిచేస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో2 లక్షలపైగా డబుల్ బెడ్‌రూం ఇండ్లకు మంజూరుకు అనుమతి ఇచ్చామని తెలిపారు

డబుల్ బెడ్ రూం ఇండ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా పూర్తిచేస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గృహనిర్మాణ సంబంధించిన కీలక అంశాలపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 లక్షలపైగా డబుల్ బెడ్‌రూం ఇండ్లకు మంజూరుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 13 వందల కోట్లుపైగా కేంద్రం నుంచి వస్తాయని, మరో రూ.2,500 కోట్లు హడ్కో నుంచి రుణంగా తీసుకుంటామని.., మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరించారు. గృహనిర్మాణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, శిశు, మైనార్టీ సంక్షేమశాఖల సంబంధించిన కీలక బిల్లుకు ఆమోదం తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories