Nalgonda జిల్లా కేతేపల్లిలో అపశృతి

Nalgonda జిల్లా కేతేపల్లిలో అపశృతి
x
Highlights

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రతి ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని పాత శివాలయం ద‍గ్గర కార్యక్రమాన్ని జరుపుతారు.

ఈ నేపథ్యంలో అగ్నిగుండంలో నడస్తుండగా తోపులాట జరిగి ప్రమాదవశాత్తు ఆరుగురు భక్తులు అగ్నిగుండంలో పడిపోయారు. వారిలో ఇద్దరి భక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అగ్నిగుండంలో నడుస్తుండగా భక్తులు ఒక్కసారిగా తోసుకోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories