తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి మృతి

తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి మృతి
x
Highlights

నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపో డ్రైవర్‌ జైపాల్‌రెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి అతని స్వగ్రామం నాంపల్లి మండలం...

నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపో డ్రైవర్‌ జైపాల్‌రెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి అతని స్వగ్రామం నాంపల్లి మండలం లింగంపల్లిలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు దేవరకొండలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. జైపాల్ రెడ్డి మృతదేహంతో దేవరకొండ బస్సు డిపో ఎదుట కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. కుటుంబసభ్యులను పరామర్శిచడానికి వచ్చిన డిపో మేనేజర్‌ను కార్మికులు అడ్డుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను కూడా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories