పోలీసులపై నిందితులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు : సీపీ సజ్జనార్‌

పోలీసులపై నిందితులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు : సీపీ సజ్జనార్‌
x
Highlights

దిశ హత్యాచార కేసు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌...

దిశ హత్యాచార కేసు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. నిందితులను ఎక్కడైతే ఎన్‌కౌంటర్‌ చేశారో అక్కడే సీపీ మీడియాతో మాట్లాడారు. ఘటనాస్థలిలో దాచిపెట్టిన సెల్‌ఫోన్, ఇతర ఆధారాలను సేకరించేందుకు నిందితులను తీసుకొచ్చామని, అయితే.. వాళ్లు పోలీసులపై దాడికి దిగారని, నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు కలిసి రాళ్లు, కర్రలతో కొట్టబోయారని, ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల వద్ద గన్స్ లాక్కుని ఫైర్ చేశారని, ఈ ఘటనలో ఎస్సైకి, కానిస్టేబుల్‌ తలకు గాయాలయ్యాయని తెలిపారు.

పోలీసులు హెచ్చరించినా వారు వినలేదని అన్నారు. ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారని ఆ తర్వాత కాల్పులు ఆగిపోయాయని అనంతరం చూస్తే నలుగురూ చనిపోయి కనిపించారని చెప్పారు. ఉదయం 5.30 గంటల నుంచి 6.15 వరకు ఈ ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు. ఈ నలుగురూ కరుడుగట్టిన నేరస్తులని తెలిపారు. వీరి నేర చరిత్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories