హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్... 31 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్

హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్... 31 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్
x
Highlights

హైదరాబాద్ నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ముఖ్యంగా అన్ని అందరి ప్రాణాలను కాపాడే వైద్యులు, వైద్య సిబ్బంది ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

హైదరాబాద్ నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ముఖ్యంగా అన్ని అందరి ప్రాణాలను కాపాడే వైద్యులు, వైద్య సిబ్బంది ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే నగరంలో 31 మంది వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. తమకు కూడా కరోనా టెస్టులు నిర్వహించాలంటూ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో ఇచ్చిన సడలింపుల్లో భాగంగా ఆస్పత్రులు కూడా పూర్తి స్థాయిలో రోగులకు అందుబాటులో రావడంతో ఇటు రోగులు కూడా భయాందోళన చెందుతున్నారు. వైద్యులకు కరోనా ఉంటే వారి నుంచి ఇతరులకు ఎక్కడ కరోనా వ్యాప్తి చెందుతుందో అని దిగులు చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ అధికారులు అత్యవసర సమావేశాలను నిర్వహిస్తున్నారు.

ఇప్పటి వరక కోరోనా బారిన పడిన వైద్యులలో పేట్లబురుజు హాస్పిటల్‌లో గైనకాలజీ విభాగంలో పని చేసే ఒక ప్రొఫెసర్, ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లు ఉన్నారు. నిమ్స్‌ హాస్పిటల్ కార్డియాలజీ విభాగంలో పని చేసే నలుగురు డాక్టర్లకు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లకు కోవిడ్ సోకిందని బుధవారం నిర్ధారణ అయ్యింది. అదే విధంగా కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి వైద్యులు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నిమ్స్ లో విధులు నిర్వర్తించే కొందరు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతే కాకుండా ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మైక్రోబయాలజీ విభాగానికి చెందిన ఇద్దరు పీజీ రెసిడెంట్లు, అనస్థీషియా విభాగంలో పని చేసే పీజీ డాక్టర్, నలుగురు హౌస్ సర్జన్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఈ హాస్పిటల్ నుంచి 20 మంది డాక్టర్ల శాంపిళ్లను సేకరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories