తెలంగాణలో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు
x
Representational Image
Highlights

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 200కి దాటింది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 200కి దాటింది. నిన్న ఒక్కరోజే 75 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ రోజు మరో 43 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 272 చేరింది. వరంగల్, మెదక్ తో పాటు పలు జిల్లాలలో ఈ కేసులు నమోదు అయ్యాయి.

ఇక రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు. దీనితో భాదితులను చికిత్స కోసం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అటు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 25 మంది కరోనా భాదితులకి చికిత్స అందిచిన నలుగురు వైద్యులను కరోనా అనుమానంతో ఐసోలేషన్ కు తరలించారు. ఇక దేశవ్యాప్తంగా 3,188 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.








Show Full Article
Print Article
More On
Next Story
More Stories