కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే స్థితిలో ఉత్తమ్ లేరు: రాజగోపాల్‌రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే స్థితిలో ఉత్తమ్ లేరు: రాజగోపాల్‌రెడ్డి
x
Highlights

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటేనన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఏఐసీసీ అధ్యక్షుడు...

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటేనన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ‌గాంధీ రాష్ట్ర నాయకత్వాన్ని సరైన సమయంలో మార్చలేకపోవడమే ఇందుకు కారణమన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ బలపడే అవకాశం ఉందని, కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, మా పార్టీ నాయకత్వం సరిలేని కారణంగా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరిక మేరకు తాను రాంమాధవ్‌ను కలిసినట్టు తెలిపారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే వారిని కాపాడుకునే స్థితిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేరని అన్నారు. టీఆర్ఎస్‌ అవినీతి పాలనకు చరమగీతం పాడాలంటే బీజేపీ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు రాజగోపాల్‌రెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories