సీఎం కేసీఆర్‌ పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సీఎం కేసీఆర్‌ పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
x
Highlights

సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లనే కేసీఆర్ సీఎం అయ్యారని విమర్శించారు. తిన్నింటి...

సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లనే కేసీఆర్ సీఎం అయ్యారని విమర్శించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు దీక్షను చూసి తట్టుకోలేక కేసీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మీడయాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ సీఎం పీఠం పోయిన కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంట వుండరని విమర్శించారు. సోనియాను ఒప్పించి తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్‌ నాయకులు బఫూన్లు అయ్యారా? అని ప్రశ్నించారు. రైతు సమస్యలు మాట్లాడితే తీవ్ర పదజాలంతో రైతులను అవమాణిస్తారా? అని నిలదీశారు. ప్రగతి భవన్ లో కేసిఆర్ ఉన్నట్టు రైతులందరూ సంతోషంగా లేరని అన్నారు. మద్యం షాపులు ఓపెన్ చేసి తాగండి, సావండి, ఖజానా నింపండి, అన్నట్లుగా కేసీఆర్ వైఖరి ఉందని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories