మహిళా మంత్రి లేని లోటును మీరే తీర్చాలి : విజయశాంతి

మహిళా మంత్రి లేని లోటును మీరే తీర్చాలి : విజయశాంతి
x
Highlights

తెలంగాణా రాష్ట్ర నూతన గవర్నర్ గా తమిళ్ ఇసై సౌందరరాజన్ ఎన్నికైన విషయం తెలిసిందే .. ఈ రోజు ( ఆదివారం) ఆమె తెలంగాణా రాష్ట్రానికి రెండో గవర్నర్ గా...

తెలంగాణా రాష్ట్ర నూతన గవర్నర్ గా తమిళ్ ఇసై సౌందరరాజన్ ఎన్నికైన విషయం తెలిసిందే .. ఈ రోజు ( ఆదివారం) ఆమె తెలంగాణా రాష్ట్రానికి రెండో గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయనున్నారు . ఈ నేపధ్యంలో తమిళ్ ఇసై సౌందరరాజన్ కి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షురాలు విజయశాంతి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ ని పెట్టారు ...

"తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా తమిళ్ ఇసై సౌందరరాజన్ గారికి శుభాభినందనలు. తెలంగాణ రాజకీయం బాగా వేడెక్కిన తరుణంలో తమిళ్ ఇసై సౌందరరాజన్ గారు గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా నిష్పాక్షిక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న కారణంగా ప్రతిపక్షాల పాత్రపై తమిళ్ ఇసై గారికి పూర్తి అవగాహన ఉంటుందని నమ్ముతున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే... 2014లో తొలిసారి కేసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కేబినెట్లో మహిళలు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. రెండోసారీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా... 9 నెలలు గడుస్తున్నా, కేసిఆర్ గారి క్యాబినెట్లో మహిళలకు ఛాన్స్ దక్కలేదు. మల్లారెడ్డి గారు ప్రస్తుతం మహిళా, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. అందువల్ల తెలంగాణలోని మహిళల సమస్యలను పట్టించుకునే దిక్కు కూడా కరువైందనే అభిప్రాయం ప్రజలలో ఉంది. ఇలాంటి తరుణంలో తెలంగాణకు మహిళా మంత్రి లేని లోటును తమిళ్ ఇసై గారు తీరుస్తారని భావిస్తున్నాను" అని విజయశాంతి పోస్ట్ చేసారు ...


Show Full Article
Print Article
More On
Next Story
More Stories