పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. గోడ కూలి చిన్నారి మృతి

పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. గోడ కూలి చిన్నారి మృతి
x
Highlights

వరంగల్ అర్భన్ జిల్లాలోని గోవిందరావుపేట మండల కేంద్రంలో ఓ దారుణమైన సంఘటన జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

వరంగల్ అర్భన్ జిల్లాలోని గోవిందరావుపేట మండల కేంద్రంలో ఓ దారుణమైన సంఘటన జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మురుగు కాలువ పనులను నిర్వహిస్తుండగా గోడ కూలి ఓ చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాల్లోకెళితే పట్టణంలోని 43వ డివిజన్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు అభివృద్ది పనులను చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మురుగు కాలువను జేసీబీతో శుభ్రం చేస్తున్నారు. కాగా ఆ కాలువ పక్కనే ఒక గోడ ఉండగా జేసీబీ దానికి తగలడంతో ఆ గొడ ఆవరణలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై గోడ కూలింది. దీంతో ప్రిన్సి అనే ఎనిమిది సంవత్సరాల బాలిక మృతి చెందిగా, ఆమె తమ్ముడు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఏజీఎం ఆస్పత్రికి తరలించారు. కగా ఈ ప్రమాదం జేసీబీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే జరిగిందని మృతురాలి తండ్రి, చిన్నారుల కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

ఇక ఈ సంఘటన గురించి సమాచారం అందగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, జిల్లా కలెక్టర్‌ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాని, ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కాగా పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇంతటి అపశ్రుతి జరగడం బాధాకరమైన విషయమని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories