జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
x
Highlights

హైదరాబాద్ మెట్రో రైలులో మరో ముందడుగు పడనుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు ప్రారంభంకానుంది. ఈ నెల 7న సీఎం కేసీఆర్ ఈ సరికొత్త మెట్రో రైలు...

హైదరాబాద్ మెట్రో రైలులో మరో ముందడుగు పడనుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు ప్రారంభంకానుంది. ఈ నెల 7న సీఎం కేసీఆర్ ఈ సరికొత్త మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుని మెట్రోరైలు భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు పొందింది.

ఈ విషయాన్ని తెలంగాణ మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నాగోల్ – హైటెక్ సిటీ కారిడార్ 29 కిలోమీటర్లు, మియాపూర్ -ఎల్బీ నగర్ కారిడార్‌ 29 కిలోమీటర్లు ప్రస్తుతం మెట్రో రైలు నడుస్తుండగా, మూడో కారిడార్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 15 కిలోమీటర్ల వరకు అందుబాటులోకి రానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories