కంచి శ్రీఅత్తివరదరాజస్వామిని దర్శించుకోనున్న కేసీఆర్‌

కంచి శ్రీఅత్తివరదరాజస్వామిని దర్శించుకోనున్న కేసీఆర్‌
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాంచీపురం శ్రీఅత్తివరదరాజస్వామిని దర్శించుకోనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాంచీపురం శ్రీఅత్తివరదరాజస్వామిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి రేణిగుంట వెళ్లనున్న కేసీఆర్‌... అక్కడ్నుంచి.. రోడ్డుమార్గంలో తమిళనాడులోని కాంచీపురం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత కంచి శ్రీఅత్తివరదరాజస్వామిని దర్శించుకోనున్నారు. సాయంత్రం నాలుగున్నర తర్వాత తిరిగి హైదరాబాద్‌ పయనంకానున్నారు. 1979లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి మరల ఈ ఏడాది జూన్‌ 1 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నెల 17వరకూ దర్శనమిచ్చే స్వామిని దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories