ఆ దుర్మార్గులకు కరోనా సోకాలి.. కేసీఆర్ శాపనార్థాలు…

ఆ దుర్మార్గులకు కరోనా సోకాలి.. కేసీఆర్ శాపనార్థాలు…
x
cm kcr
Highlights

నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ కరోనాపై సోషల్‌ మీడియా, ఇతర మీడియాలో దుర్మార్గమైన ప్రచారాలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు....

నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ కరోనాపై సోషల్‌ మీడియా, ఇతర మీడియాలో దుర్మార్గమైన ప్రచారాలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. చాలా భయంకరమైన శిక్షలుంటయి. ఇట్ల ఉంటయి నేను చూపిస్త. ఎంత చేస్తే దానికి 100 రెట్ల శిక్ష అనుభవిస్తరు. ఇలా చేసే వారికి అందరికంటే ముందు కరోనా సోకుతది. సోకాలి కూడా. దుర్మార్గులకు ఫస్ట్‌ కరోనా పట్టుకోవాలని నేను శాపం పెడుతున్న అని అన్నారు.

ఇలాంటి క్లిష్ట స‌మ‌యాల్లో ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని పేర్కొన్నారు. క‌రోనా వ‌స్తే బాధ ఏంటో, వారి ఇబ్బందులు ఏంటో..వెద‌వ‌ల‌కు తెలియాల‌ని..ప్ర‌బుద్దుల‌ తాట తీస్తానని సీఎం హెచ్చరించారు. ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తోందని, మంత్రి కూడా రివ్యూ చేస్తున్నారని.. బులిటెన్ విడుదల చేస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని.. ప్రభుత్వం ఇచ్చే వివరాలను నమ్మాలని సూచించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories