సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ఉన్నతస్థాయి సమావేశం.. కీలక ప్రకటన చేసే అవకాశం..

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ఉన్నతస్థాయి సమావేశం.. కీలక ప్రకటన చేసే అవకాశం..
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కరోనా వైరస్ ను కట్టడి...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై చర్చిస్తున్నారు. మొన్నటి వరకు రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన కరోనా ప్రస్తుతం జిల్లాలకు కూడా పాకడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు..? ఏదైనా కీలకమైన ప్రకటన చేస్తారా..? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక నగరాలు, పట్టణాల్లో నిషేధాజ్ఞలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories