కాసేపట్లో ఆర్టీసీ సమ్మె, చర్చలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై..

కాసేపట్లో ఆర్టీసీ సమ్మె, చర్చలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై..
x
Highlights

ఆర్టీసీ సమ్మె, తెలంగాణ బంద్‌, హైకోర్టు సూచనలపై సీఎం కేసీఆర్‌ కాసేపట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో...

ఆర్టీసీ సమ్మె, తెలంగాణ బంద్‌, హైకోర్టు సూచనలపై సీఎం కేసీఆర్‌ కాసేపట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో నిర్వహించనున్న ఈ సమీక్షా సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ, ఇతర అధికారులు హాజరుకానున్నారు. మరోవైపు నిన్న హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వుల కాపీలు తమకు అందలేదని రవాణాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇవాళ జరిగే సమీక్షలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేదానిపై ఆసక్తి నెలకొంది. సమ్మెను విరమిస్తేనే చర్చలంటున్న ప్రభుత్వం దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది తెలియనుంది. ఇటు ఈ సాయంత్ర తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించేందుకు ఆర్టీసీ జేఏసీ కూడా సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories