ఈ నెల కూడా ఆ శాఖల ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గిఫ్ట్..

ఈ నెల కూడా ఆ శాఖల ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గిఫ్ట్..
x
తెలంగాణ సీఎం కేసీఆర్
Highlights

రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యం కోసం 24గంటలు శ్రమిస్తున్న వివిధ శాఖలలోని సిబ్బందికి గత నెలలో ఇచ్చినట్టు గానే ఈ నెలలో కూడా ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం...

రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యం కోసం 24గంటలు శ్రమిస్తున్న వివిధ శాఖలలోని సిబ్బందికి గత నెలలో ఇచ్చినట్టు గానే ఈ నెలలో కూడా ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ప్రోత్సాహకాలు అందుకుంటున్న వారిలో పారిశుధ్య సిబ్బంధి, పోలీసు సిబ్బంధి, వైద్య సిబ్బంధి ఉన్నారు. వారందరూ విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి , ప్రజల ఆరోగ్యాన్ని కపాడటానికి తమ వంతు కృషి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే జలమండలి సిబ్బందికి, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ వారికి రూ.7,500 నగదు, పంచాయతీల్లోని పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు రూ.5000 నగదు, పురపాలక సంఘాల పారిశుద్ధ్య కార్మికులకు రూ.5000 నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి జీవో జారీ సింది ప్రభుత్వం. వారితో పాటు గానే తమ ప్రాణాలకు తెగించి రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యులకు, ఇతర సిబ్బంధికి పూర్తి వేతనం, దాంతో పాటుగానే 10 శాతం ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. అలాగే పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్నవారికి 10శాతం ప్రోత్సహకాలను అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ విదంగానే గత నెలలో కూడా సీఎం కేసీఆర్ ప్రోత్సాహకాలను అందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories