అయోధ్య తీర్పు నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలి:సీపీ

cp Anjani Kumar
x
cp Anjani Kumar
Highlights

ఈ నెలలో వెలువడనున్న అయోధ్య తీర్పును దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు కమిషనర్ అంజని కుమార్ నిర్వహించారు.

ఈ నెలలో వెలువడనున్న అయోధ్య తీర్పును దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు కమిషనర్ అంజని కుమార్ ఆదివారం హిందూ మత సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని హైదరాబాద్ సీపీ కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ వాహిని, భారతీయ జనతా పార్టీ (బిజెపి), బిజెవైఎం, మహిలా మోర్చా సభ్యులతో సహా వివిధ సంస్థలకు చెందిన మరో 40 మంది నాయకులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పును దృష్టిలో పెట్టుకుని నగరంలో శాంతిభద్రతల నిర్వహణ గురించి ఈ సమావేశంలో చర్చించారు. కోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామని ఎలాంటి నిరసనలు కాని, సంబరాలు కాని చేయమని నాయకులందరూ ఈ సందర్భంగా తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ఫేక్ వార్తలు, పుకార్లను పుట్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై కటిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories