నా భర్తను చివరిచూపు చూడనివ్వండి : చెన్నకేశవులు భార్య

నా భర్తను చివరిచూపు చూడనివ్వండి : చెన్నకేశవులు భార్య
x
Highlights

పోస్ట్ మార్టం జరిగిన తర్వాత కూడా మృతదేహాలు అప్పగించకపోవడంపై దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భర్తను చివరిచూపును...

పోస్ట్ మార్టం జరిగిన తర్వాత కూడా మృతదేహాలు అప్పగించకపోవడంపై దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భర్తను చివరిచూపును చూడనివ్వరా అని ఆమె ప్రశ్నించారు. వెంటనే తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై అనుమానాలను NHRC బృందం తమను అడిగి తెలుసుకుందని నిందితుల తల్లిదండ్రులు వెల్లడించారు. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కూడా ఆరా తీశారాని తెలిపారు. నిన్న నారాయణ పేట జిల్లా జక్లేర్, గుడిగండ్ల గ్రామాల నుంచి నిందితుల తల్లిదండ్రులను హైదరాబాద్ కు పోలీసులు తరలించారు. NHRC బృందం ఎదుట వారిని హాజరుపరిచి తిరిగి వారి స్వగ్రామాలకు పంపించారు. ఎన్ కౌంటర్ పై తమకున్న అనుమానాలను NHRC బృందానికి వివరించినట్లు నిందితుల తల్లిదండ్రులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories