పదో తరగతి పరీక్ష తేదీలో మార్పు?

పదో తరగతి పరీక్ష తేదీలో మార్పు?
x
Highlights

తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్ష తేదీలో మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మార్చి 22న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల...

తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్ష తేదీలో మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మార్చి 22న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉన్నందున ఆరోజు పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదు. దీంతో ఆరోజు పదోతరగతి ఇంగ్లీష్ పేపర్-2 పరీక్ష తేదీలో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల తేదీ మారే అవకాశం లేదు కాబట్టి పరీక్ష తేదీనే మార్చాల్సి ఉంటుందని ఆర్‌టీయూ తెలంగాణ నాయకులు అంజిరెడ్డి, చెన్నయ్య కోరారు. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార్‌కు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నట్టు విజయ్‌కుమార్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories