రాష్ట్రానికి రానున్న కొత్త ఐపీఎస్‌లు..

రాష్ట్రానికి రానున్న కొత్త ఐపీఎస్‌లు..
x
Highlights

రాష్ట్రానికి మరో 11 మంది కొత్త ఐపీఎస్‌ అధికారులు రాబోతున్నారు.

రాష్ట్రానికి మరో 11 మంది కొత్త ఐపీఎస్‌ అధికారులు రాబోతున్నారు.కేంద్ర హోంశాఖ తెలంగాణకు ఇటీవల కేటాయించిన 11 మంది ఐపీఎస్ అక్టోబర్‌ చివరివారంలోనో, నవంబర్‌ తొలివారంలోనో రాష్ట్రానికి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నారని సెప్టెంబర్‌ నాటికి శిక్షణ పూర్తి చేసుకోనున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఐపీఎస్ అధికారుల కొరత ఏర్పడడంతో తెలంగాణ ప్రభుత్వం 40 మంది ఐపీఎస్‌ అధికారులు కావాలని కేంద్రాన్ని గతంలో కోరింది. దీంతో స్పందించిన కేంద్రం ఈ ఏడాది తెలంగాణకు 11 మంది ఐపీఎస్‌ అధికారులను పంపించనుంది.

ఇక జూన్‌ మాసంలో ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు రిటైర్‌ కానున్నారు. దీంతో హోంశాఖ ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఇప్పటికే బదిలీలు, పదో న్నతులపై పూర్తిగా కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఐజీల పదోన్నతుల విషయంలో కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐపీఎస్‌లకు డీఐజీలు, ఐజీలుగా పదోన్నతి కల్పించగా సాంకేతిక కారణాలు, కరోనా కేసులు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో నలుగురు ఐజీ ర్యాంకు అధికారులకు పదోన్నతి కల్పించే ఫైలు ముందుకు కదలలేదు. వీరికి కూడా ఇదే నెలలోనే పదోన్నతులు వస్తాయని సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories