తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదు
x
Highlights

లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి...

లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి తోటలను పరిశీలించి రైతులను కలిసేందుకు వచ్చిన బండి సంజయ్... అక్కడే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన వెంట పార్టీకి చెందిన స్థానిక నేతలు కూడా ఉన్నారు.

ఈ క్రమంలో బండి సంజయ్‌తో పాటు ఆయనతో ఉన్న నేతలంతా భౌతిక దూరం పాటించకుండానే పర్యటన కొనసాగించారని నల్గొండ పోలీసులు తెలిపారు. దీంతో పెద్దవూర పోలీసులు సంబయ్‌తో పాటు పలువురిపై 188 సెక్షన్‌ క్రింద కేసులు నమోదు చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 203కు వ్యతిరేకంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు నిరసన దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీజేపీ కార్యాలయంలో దీక్ష చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories