కరీంనగర్ లో ఘోర ప్రమాదం: మానేరు వంతెనపై నుంచి కింద పడిన కారు

కరీంనగర్ లో ఘోర ప్రమాదం: మానేరు వంతెనపై నుంచి కింద పడిన కారు
x
Highlights

అతి వేగంవలన ఎన్నో రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతో మంది తమ ప్రాణాలకు కోల్పోతున్నారు. ఇదే నేపథ్యంలో కరీంనగర్‌ పరిధిలోని అల్గునూరు వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

అతి వేగంవలన ఎన్నో రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతో మంది తమ ప్రాణాలకు కోల్పోతున్నారు. ఇదే నేపథ్యంలో కరీంనగర్‌ పరిధిలోని అల్గునూరు వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌- హైదరాబాద్‌ హైవే మీద ఉన్న మానేరు డ్యాం వంతెన పై నుంచి ఓ కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. దీంతో స్థానికులు వెంటనే కాలువలోకి దిగి వాహనాన్ని లేపి అందులో ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేసారు. కాగా ఈ వాహనం కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో హైదరాబాద్‌-కరీంనగర్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ వాహనంలో కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌ కు చెందిన గండి శ్రీనివాస్‌ (40), అతని భార్య ప్రయాణిస్తుండగా అందులో శ్రీనివాస్ అక్కడిడక్కడే మృతిచెందారు. అతని భార్య తీవ్రగాయాల పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమయంలోనే బ్రిడ్జ్‌పై నుంచి శంకర్ అనే కానిస్టేబుల్ కారును పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు అతను కూడా కాలువలో పడిపోయాడు. ఆ ప్రాతంలో నీళ్లు లేకపోవడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు ఆయనను వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అయనను పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories