రేపటి నుంచి క్యాబ్ డ్రైవర్ ల సమ్మె

రేపటి నుంచి క్యాబ్ డ్రైవర్ ల సమ్మె
x
Highlights

తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. తాజాగా క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది.

తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. తాజాగా క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది. ఓలా, ఉబర్, ఐటీ కంపెనీలకు సేవలు అందిస్తున్న క్యాబ్స్ ఓనర్లు, డ్రైవర్లు సమ్మెకు దిగనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ తెలిపారు.

కిలోమీటరుకు కనీస రుసుమును రూ. 22 చేయాలనే డిమాండ్ తో సమ్మెను చేపట్టబోతున్నట్టు చెప్పారు. ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పని చేస్తున్నవారికి జీవో నెంబర్ 61,66 అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారన్నారు. 19 నుంచి సమ్మెకు వెళ్లాలా వద్దా అనే విషయంపై అసోసియేషన్‌లో ఓటింగ్ నిర్వహించగా 75% మంది సమ్మె చేయాలని నిర్ణయించారు. దీంతో సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు తెలిపారు. ట్యాక్సీ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. డ్రైవర్లపై జరుగుతున్న దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఆగస్టు 30న తెలంగాణ రవాణాశాఖకు లేఖ అందించామని అయితే, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తాము సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories