బస్సు ప్రమాదం.. తెల్లవారుజామున ఘటన..

బస్సు ప్రమాదం.. తెల్లవారుజామున ఘటన..
x
Highlights

నల్గొండ జిల్లాలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 22 మందికి స్పల్ప గాయాలు కాగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది...

నల్గొండ జిల్లాలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 22 మందికి స్పల్ప గాయాలు కాగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని వేములపల్లి మండలం బుగ్గబావి వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం సంభవించింది. గాయపడ్డ వారిని హుటాహుటిన మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్‌ బయల్దేరింది.

శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో బుగ్గబావిగూడెం సమీపంలోకి రాగానే వేగంతో వెళ్తున్న కంటైనర్‌ను తప్పించే క్రమంలో బోల్తాపడి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఒకరిమీద ఒకరు పడటంతో ఊపిరాడలేదు. అంతేకాకుండా పలువురికి గాయాలయాయ్యి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories