అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సుల్లో చేరేందుకు గడువు పెంపు

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సుల్లో చేరేందుకు గడువు పెంపు
x
Highlights

డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు గడువును పొడగించారు.

బంజారాహిల్స్ లోని డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు గడువును పొడగించారు. సెప్టెంబర్ 5వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.in వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. ఇక మరిన్ని వివరాలకు యూనివర్సిటీ ఫోన్ నెంబర్ 73829570 , 580, 600 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. అయితే ఈ గడువు ఆగస్టు 31 వరకు చివరి తేదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దూర ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకటన చేసినట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories